‘అర్జున్ సురవరం’తో ఇటీవలే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నిఖిల్… లాక్ డౌన్ సమయంలో పెళ్లితో ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో “18 పేజెస్”లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి అయితే ఇన్నిరోజులు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో త్వరలో డైరెక్టర్ గా మారుతారని వార్తలు విన్పించాయి. ఈ వార్తలపై హీరో నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మేం పిల్లల సినిమాకు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ను రాశాం. నేను త్వరలోనే ఎలాంటి సినిమాను డైరెక్ట్ చేయడం లేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న రెండు చిత్రాలు 18 పేజీస్, కార్తికేయ 2 సినిమాలు అక్టోబర్, నవంబర్ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్తో నేను ఫుల్ బిజీ అవుతున్నాను. త్వరలోనే థియేటర్స్లో కలుద్దాం” అన్నారు నిఖిల్.
previous post