telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోవిడ్ సెంటర్‌కు భారీ విరాళం ప్రకటించిన బాలయ్య

NBK

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు 55 లక్షల రూపాయల విరాళం ప్రకటించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు కరోనా వైరస్ నివారణకై ఉపయోగించే మందులు, కావాల్సిన పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర అన్ని పరికరాలను అందించడానికి ఈ విరాళాన్ని ప్రకటించారు బాలకృష్ణ. కాగా ఈ కల్లోల పరిస్థితుల్లో సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మనకోసం’ అందించిన సాయం లోనూ భాగం పంచుకున్న బాలయ్య బాబు గతంలో 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున అందించారు బాలయ్య. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ బాలయ్య చేసిన సాయానికి పలువురి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రూపొందుతోంది. బాలయ్య డిఫరెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది.

Related posts