telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాతగా మారిన కృష్ణుడు

Krishnudu

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన నటుడు కృష్ణుడు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలలో హీరోగా కూడా మెప్పించారు. కాగా ఈ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కృష్ణుడు తన కూతురు పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను లాంఛ్ చేశాడు. త్వరలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. “మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్” అనే చిత్రాన్ని కొత్త నటీనటులతో జయైరామ్ దర్శకత్వంలో రూపొందనుంది. అయితే కొంత కాలం విరామం తర్వాత కృష్ణుడు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలెట్టబోతున్నారు. ఇక నటుడుగా ఆదరించిన తనను నిర్మాతగా కూడా ప్రోత్సహించాలని ఆయన కోరుకున్నారు.

Related posts