telugu navyamedia
సినిమా వార్తలు

షూటింగ్ లో గోపీచంద్ కు తీవ్రగాయాలు

gopichand in indo-pak boarder
యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా రాజస్థాన్ లో సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గోపీచంద్ బైక్ పై నుండి పడిపోయారని సమాచారం. దీంతో ఆయన శరీరానికి తీవ్ర గాయాలవ్వగా, వెంటనే అతడిని దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్ళారట. ఇంకా ఈ విషయానికి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Related posts