బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తనకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనకోసం ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. తనలాగే అందరూ ముందస్తు చర్యల్లో భాగంగా ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్లు, షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి. టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా క్వారంటైన్లో చేరాడు. జర్మనీ నుంచి భారత్ చేరుకున్న ధావన్… నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్కు వెళ్లాడు. అక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో షేర్ చేసిన ధావన్ 24 గంటల పర్యవేక్షణలో ఉన్నామని అందరికీ పరిశుభ్రమైన గదులు కేటాయించారని చెప్పారు.