రాయలసీమ ప్రాంతానికి రావడం, ఇక్కడి ప్రజలను కలవడం ఆనందం కలిగిస్తోందని హాస్యనటుడు ఆలీ అన్నారు. ఆదివారం అనంతపురంలో ఆలీ సందడి చేశారు. నూతనంగా నిర్మించిన గఫూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాయలసీమ రతనాల సీమ అని అన్నారు. సామాజిక స్పృహతో ప్రజలకు మంచి సేవలు అందించి పేరు ప్రతిష్టలు పొందాలని సూచించారు.
కాగా, ఆలీని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. మధ్యాహ్నం 11 గంటల వరకు ఆలీ ర్రక కోసం వేచిచూశారు. అయితే ఆయన రాక రెండు గంటలు ఆలస్యమైంది. ఆలీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కేరింతలు కొడుతూ సెల్ఫోన్లో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. ఒక దశలో జనం మధ్య ఆలీ అతికష్టమ్మీద వెళ్లిపోవడం కనిపించింది.