టాలీవుడ్లో బ్యూటీపుల్ కపుల్స్లో నాగచైతన్య, సమంతలు ఒకరు. ఎంతో ఇష్టపడి 2017లో వీరిద్దరి ప్రేమవివాహం చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల బంధం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి. వీరిద్ధరి మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నారని కథనాలు వస్తున్న వీటి పై అటు సమంతగానీ.. ఇటు అక్కినేని కుటుంబం ఇప్పటివరకు స్పంధించలేదు.
అయితే.. గాసిప్స్ కోసం తన పేరును వాడడం కొంత బాధగా అనిపించిందని నటుడు నాగచైతన్య అన్నారు. ‘లవ్స్టోరీ’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలు ఉంటాయని, ఆ రెండింటినీ తాను వేర్వేరుగానే చూస్తానని తెలిపారు.
‘‘నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ను వేర్వేరుగా చూడడం నేర్చుకున్నా. ఆ రెండింటినీ కలిపి చూడను. ఈ విషయాన్ని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకొన్నాను. షూటింగ్స్ లేదా ఇతర బిజినెస్ వర్క్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లిద్దరూ ఆ విషయాల గురించి చర్చించుకోరు. అదే మాదిరిగా పనిలో రాగానే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరు’’ అని చైతన్య తెలిపారు.
సోషల్మీడియాలో వచ్చే వార్తలపైనా ఆయన స్పందించారు. ‘‘ఒకానొక సమయంలో నాపై ఎన్నో అసత్యవార్తలు వచ్చాయి. వాటిని చూసి కొంత బాధపడ్డా. ‘ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?’ అనుకున్నా. పాత రోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవి. నెలకో మ్యాగజైన్ వచ్చేది. దానివల్ల, ఒక నెలంతా అదే వార్త వినిపిస్తుండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్షణాల్లోనే ఒక వార్తను మరో వార్త రీప్లేస్ చేసేస్తోంది. ఎన్ని వార్తలు వచ్చినా.. వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అర్థమైనప్పటి నుంచి నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు’’ అని చై వివరించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ముచ్చటైన ప్రేమకథను కూడా తన సినిమాలో చూపిస్తాడు శేఖర్ కమ్ముల. ఈ క్రమంలో వచ్చిన సినిమానే లవ్ స్టోరీ. గామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.