కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమా చిరంజీవికి ప్రతిష్టాత్మకంగా మారింది. కాజల్ అగర్వాల్ మరోసారి చిరుతో ఈ సినిమాలో జతకట్టింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిరంజీవి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పైగా రాంచరణ్ కూడా ఇందులో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 25 కోట్ల విలువైన భారీ సెట్ నిర్మించారు. సినిమాలో ఎక్కువ భాగం అక్కడే పూర్తవుతుంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే నిన్న ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ చేసిన అతి కొద్ది గంటల్లోనే రికార్డుల మోత మోగింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ వన్ లో ఉంది. ఇప్పటికే ఆరు మిలియన్ల వ్యూస్ను ఆచార్య టీజర్ కొల్లగొట్టింది. దాంతో పాటే 500k లైకులు సంపాదించుకుంది. అనుకున్నట్లుగా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ అదిరిపోయింది. రాంచరణ్ వాయిస్ తో ప్రారంభమైన టీజర్.. చిరు యాక్షన్ సీన్స్ వరకు సాగిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం బాగుంది. ఏది ఏమైనా చిరు స్టామినాకు నిదర్శనంగా ఆచార్య టీజర్ నిలిచింది.
previous post