telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేశారు: నిందితుని తండ్రి ఆవేదన

disa accused Funeral will be tomorrow

దిశ హత్య కేసులో నిందితుడు శివను ఎన్‌కౌంటర్‌ చేయడంపై ఆయన తండ్రి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేశారనిఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ చేయడంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే కనీసం చివరిసారిగా ముఖం చూపించకుండా, మాట్లాడనీయకుండా ఎన్‌కౌంటర్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులను చంపుతామని పోలీసులు తనకు చెప్పినా బాధ ఉండదన్నారు. కానీ చివరిసారిగా ఒకసారి మాట్లాడించినట్లయితే సంతోషంగా ఉండేదన్నారు. ఆ విధంగా లేకుండా చేశారన్నారు. పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేసినప్పుడు కూడా ఉరిశిక్ష వేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పామన్నారు.

Related posts