telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బ్రేకింగ్‌ : బొగ్గు గనిలో ఘోర ప్రమాదం..23 మంది మృతి

చైనాలో మరో దారుణం చోటుచేసుకుంది. బొగ్గు గనులలో మరో ప్రమాదం జరిగింది. అక్కడి శ్రామికులు దాదాపు 23 మంది మరణించారు. దాంతో అక్కడ విషాద మేఘాలు అలముకున్నాయి. అయితే ఈ సంఘటన చైనా యంగ్‌ చువాన్ ప్రాతంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఒక్కరు రక్షించ బడ్డారు. వారు తెలిపిన దాని ప్రకారం ఆ ప్రాంతంలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉండటం కారణంగానే ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ప్రమాదం సాయంత్రం 5గంటల సమయంలో చోటు చేసుకుంది. అక్కడ 24 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే వారు తమతమ పరికరాలను గొయ్యిలో వేస్తుండగా జరిగింది. దాంతో 24 మంది లోపల చిక్కుకుపోయారు. రక్షణ సిబ్బంది చేరుకునే సరికి 23 మంది మరణించి ఉన్నారు. ఒక్కరు మాత్రం రక్షించ బడ్డారు. అతడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదం రెండు నెలల వరకు మూతబడింది. ఈ ప్రమాదం పై ఇంకా విచారణ కొనసాగుతోంది.

Related posts