telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో రెండు ఆర్టీసీలు ఢీ..ఐదుగురు మృతి

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్‌ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొదట ఆర్టీసీ బస్సును గ్యాస్‌ సిలిండర్ల లారీ ఢీకొట్టగా.. అనంతరం బస్సును ఎదురుగా వచ్చిన మరో బస్సు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దీంతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు గాయపడ్డారని.. రోడ్డు పక్కన చెత్త తగులబెట్టడం వల్ల దట్టమైన పొగలు కుమ్ముకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దారి కనిపించకనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు.

Related posts