కరీంగనర్ పట్టణానికి సమీపంలోని మానేరు వంతెనపై నుంచి ఓ కారు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయింది. కారు నడుపుతున్న గడ్డి శ్రీనివాస్ మృతి చెందారు. అతని భార్య సునీతకు, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో కొందరు కిందకు దిగి సాయం చేస్తున్న వేళ, బ్రిడ్జిపై నుంచి ఘటనా స్థలిని చూస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అదుపుతప్పి అందులో పడిపోయారు.
ఈ ఘటన జరగడానికి ముందే ఓ వ్యక్తి దీన్ని వీడియో తీస్తుండటంతో పై నుంచి కానిస్టేబుల్ పడుతున్న దృశ్యాలు ఇందులో నిక్షిప్తం అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రశేఖర్ కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతని పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై వేధింపులు: సిద్ధరామయ్య