telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఏసీబీ చిక్కిన గూడూరు తహసీల్దార్‌

acb ap logo

ఓ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్‌ హసినాబీనీ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం మండలానికి చెందిన ఓ రైతు భూమికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతు పలుమార్లు అధికారులను కలిశాడు.

ఈ లావాదేవీ పూర్తి చేసేందుకురు తహసీల్దార్‌ హసినాబీ ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారని రైతు ఆరోపించారు. దీనికి రైతు అంగీకరించడంతో ముందుగా నాలుగు లక్షలు ఇవ్వాలని కండిషన్‌ విధించారు. ఈ మేరకు రైతు నుంచి తహసీల్దార్‌ నాలుగు లక్ష రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts