ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వలకు చిక్కింది. అడ్డంగా బుకైనా ఆ అధికారిని ఏసీబీ అధికారులు
అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చింది. వివరాల్లోకి వెళితే భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఆయన కుమారుడు, కుమార్తె సైతం చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతుని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొంది.
అనంతరం ఆ పత్రాలు ఆర్ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. ఆపై సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఆమె లంచం అడిగింది. దీంతో రూ. 3 వేలకు డీల్ కుదుర్చుకున్న బేబీ, ఆపై ఏసీబీ అధికారును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా, పట్టుకున్నారు. ఆపై సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇక తాను పట్టుబడిన తరువాత సౌజన్యా రాణి, వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాల వీడియో వైరల్ గా మారింది.
i