telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కిడ్నప్ కు గురైన బాలుడిని కాపాడిన అబిడ్స్ పోలీసులు,,,

హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిడ్నప్ కు గురయ్యాడు 3 సంవత్సరాల రుద్రమణి. అయితే కిడ్నప్ కు గురైన బాలుడిని సురక్షితంగా కాపాడారు అబిడ్స్ పోలీసులు. బీదర్ ప్రాంతానికి చెందిన శివ కుమార్,అంబికా దంపతుల కుమారుడు రుద్రమణి. అయితే  బాలుడిని షామ్ బిలాల్ సోలంకి అనే వ్యక్తి కిడ్నప్ చేసి బాలుడితో మహారాష్ట్రకు పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేస్ నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు. అయితే బతుకు దేరువుకోసం ఇటీవల నగరానికి వచ్చిన దంపతులు నాంపల్లి లోని లేబర్ అడ్డా వద్ద తమ కుమారునితో పాటు,మరో ఇద్దరు కుతుర్లతో పనికోసం రోజు వచ్చే వారు. ఆ దంపతుల ఉన్న 3ముగ్గురు పిల్లలను గమనించిన షామ్ సోలంకి బాలుడిని ఎలాగైనా కిడ్నప్ చేయాలని పతాకం పన్నాడు. బాలుని తల్లిదండ్రులను చనువుగా ఉండసాగడు, అదను చూసి ఈ నెల 8వ తేదీన నిందితుడు షామ్ సోలంకి పబ్లిక్ గార్డెన్ వద్ద ఆడుకుంటున్న బాలుడికి చక్లెట్ ఇపిస్తానని నమ్మబలికి కాలినడకన ఎంజిబిస్ బస్టాండ్ చేరుకొని అక్కడనుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహారాష్ట్ర తీసుకెళ్లాడు. అయితే అబిడ్స్ పోలీస్ లు దాదాపు 300 సిసి కెమెరాలు పరిశీలించి కిడ్నప్ కు గురైన బాలుడిని అలాగే నిందితుడిని పట్టుకున్నారు.

Related posts