telugu navyamedia
రాజకీయ వార్తలు

తాము బీజేపీలో చేరలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యేలు

aap party

ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని బీజేపీ నేతలు చెబుతున్న వీడియోకు తెరపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు నేడు స్పీకర్ ఎదుట తాము బీజేపీలో చేరిన మాట అవాస్తవమని స్పష్టం చేశారు. తాము ఆమ్ ఆద్మీలోనే కొనసాగుతున్నామని చెప్పి బీజేపీని ఇరుకున పెట్టారు. ఈ విషయమై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సీనియర్ నేతలు విజేంద్ర గుప్త, విజయ్ గోయల్‌లు తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బీజేపీలో చేరారని చెప్పారని తెలిపారు.

అయితే ఆఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, తమ పార్టీలోనే కొనసాగుతున్నారని సౌరభ్ స్పష్టం చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయల్, సదరు ఆప్ ఎమ్మెల్యలిద్దరినీ వివరణ కోరగా, తాము ఆప్‌తోనే ఉంటామని తేల్చి చెప్పినట్టు సౌరభ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలిద్దరూ తమ పార్టీలో చేరారని బీజేపీ నేతలు చెబుతున్న వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.

Related posts