హిందీలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి వై నాట్ స్టూడియోస్ సంస్థ “విక్రమ్ వేద” చిత్రాన్ని రీమేక్ చేయనుంది. ఇందులో హీరోలు ఎవరనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోగా, పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్లు విజయ్ సేతుపతి, మాధవన్ పాత్రలలో కనిపించనున్నారని చెబుతున్నారు. హిందీ ప్రాజెక్ట్ కూడా పుష్కర్- గాయత్రినే తెరకెక్కించనున్నారు. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో పుష్కర్-గాయత్రి తెరకెక్కించిన చిత్రం “విక్రమ్ వేద”. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. చిత్రంలో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రని పోషించగా, ప్రతి నాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించాడు. శ్రద్ధ శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్స్టర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, హిందీలలో ఈ చిత్రం రీమేక్ కానుందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి.
previous post