టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార “3 మార్కర్ ఛాలెంజ్” అంటూ యూట్యూబ్ వేదికగా సందడి చేస్తోంది. సితారకు తోడుగా దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు ఆద్య కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంది. గతంలో ఆద్య, సితార “మహర్షి” చిత్రీకరణ సమయంలో దేవి శ్రీ ప్రసాద్తో కలిసి సందడి చేశారు. అప్పుడు వీరి హంగామాకి నెటిజన్స్ ఫిదా అయ్యారు. తాజాగా “3 మార్కర్ ఛాలెంజ్” అంటూ వారు చేస్తున్న సందడి నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. వారిద్దరు కలసి సందడి చేసిన యూ ట్యూబ్ వీడియోని మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆ పిల్లలిద్దరికి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు యూట్యూబ్ వేదికగా వారు చేసిన ఫర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయండని చెప్తూ వీడియోను పోస్ట్ చేశారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.
రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్