ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ కాలనీలో పవన్ అనే వ్యక్తి తన భార్య లిఖిత తో కలిసి నివసిస్తున్నాడు. పవన్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ని హైటెక్ మిషన్స్ ట్రాన్స్పోర్ట్ సూపర్ వైసర్ గా నిర్వహిస్తున్నాడు. మంగళవారం రోజు విధులు ఇంట్లోకి వచ్చిన పవన్ లోపలికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికీ పవన్ బయటికి రాకపోవడంతో కంగారుపడిన తన భార్య లిఖిత పోలీసులకు స్థానికులకు సమాచారం అందజేసింది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే పవన్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు పవన్ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
previous post