telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో దారుణం… రూ.720 కోసం పండ్ల వ్యాపారిని హత్య చేసిన దుండగులు

హయత్ నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ లోని డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి దారుణ హత్య గురయ్యాడు. బండ రాయితో కొట్టి హత్య చేసారు గుర్తు తెలియని యువకులు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు… ముగ్గురు యువకులే హత్య చేసినట్టు గా గుర్తించారు. కేవలం 720 రూపాయలకే పండ్లు వ్యాపారి మధుసుధన్‌రెడ్డి ని దారుణంగా హత్య చేసారు ముగ్గురు యువకులు. మద్యం కొనుగోలులో రూ. 720 వివాదమే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. నిందితులు సందీప్ రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ లను అరెస్ట్ చేసారు పోలీసులు. వివరాల్లోకి వెళితే… ఓ బెల్ట్ షాప్ వద్ద ముగ్గురు యువకులకు చెందిన గూగుల్ పే పని చేయకపోవడంతో డబ్బుల సహాయం చేసాడు మధుసూదన్. ఏటిఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తామని మధుసూదన్ ను వెంట తీసుకువెళ్లిన యువకులు.. కొద్ది దూరం వెళ్ళాక మధుసూదన్ తో వాగ్వివాదానికి దిగారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ బండ రాయితో కొట్టి దారుణ హత్య చేసారు యువకులు. రూ.720 అప్పుగా ఇచ్చినందుకే దారుణ హత్య కు గురైయ్యాడు పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి. సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో కేసును చేధించారు పోలీసులు.

Related posts