telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ వింత శిశువు జననం

హైదరాబాద్ లో ఇటీవల వింత శిశువు జన్మించిన విషయం తెలిసిందే . నడుము నుంచిపై వరకు మనిషి ఆకారంలో, నడుము నుంచి కింద వరకు చేప ఆకృతిలో ఉంది పుట్టిన బిడ్డ. దీంతో ఆ బిడ్డను చూసి వైద్యులు షాక్ తిన్నారు. బిడ్డ పుట్టిన రెండు గంటల్లోనే మరణించినట్టు తెలిపారు వైద్యులు.  ఈ ఘటన మరువకముందే… నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ కాప్రాకి చెందిన సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించింది. హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో ఈ శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో చికిత్స పొందుతున్న ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గతంలోనూ సరళ నిలోఫర్‌లోనే వింత శిశువుకు జన్మనించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. 

Related posts