రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలోని ఉంబా నదిపై నిర్మించిన ఓ వంతెన రాత్రికిరాత్రే మాయమైంది. ఉంబా నదిపై ఉన్న బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలే మాయం చేశారు. ఈ బ్రిడ్జిలో ఉన్న విలువైన ఇనుము కోసం దొంగలు ఈ పని చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగల చేతివాటంతో 75 అడుగుల పొడవు, 56 టన్నుల బరువున్న ఈ వంతెన ఇప్పుడు రూపు లేకుండా పోయింది. వంతెనలోని మధ్య భాగాన్ని కూల్చేసి అందులో ఉన్న ఇనుమును దొంగిలించుకెళ్లారు. తొలుత ప్రకృతి వైపరీత్యాల కారణంగా వంతెన పాక్షికంగా కూలిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. తరువాత ఇది దొంగల పని అనుకుని అధికారులు సైతం షాకయ్యారు.
previous post