సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో సోమవారం ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.91లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ16 ఎఫ్ డీ 6789 నంబరు ఇన్నోవా కారులో గుంటూరు జిల్లా మందడం గ్రామానికి చెందిన ఆలూరి జగన్మోహనరావు, గుణదలకు చెందిన యండ్లూరి కిరణ్కుమార్ 91లక్షల నగదు తరలిస్తున్న విషయం బయట పడింది. దీంతో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి