telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కరోనా బీభత్సం…పెళ్లికి వెళ్లిన 86 మందికి పాజిటివ్

marriage

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1321 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఐదుగురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో 293 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,140 కు చేరగా.. రికవరీ కేసులు 3,02,500 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1717 మంది మృతి చెందారు.. ఇది ఇలా ఉండగా..తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో కరోనా కలకలం రేపింది. ఓ పెళ్లి హాజరైన వారిలో 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మూడు రోజులుగా అధికారులు క్యాంప్ కొనసాగిస్తున్నారు. 370 మందికి టెస్టులు చేయగా.. 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ మరికొంత మందికి టెస్టులు చేయనున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. దీంతో స్థానికుల్లోనూ కలవరం నెలకొంది. 

Related posts