ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో నగదు కట్టలుకట్టలుగా బయటపడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చీరాలలో ప్రసాదనగరంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో నగదును దాచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందింది. దీనితో అధికారులు ఈరోజు ఉదయాన్నే హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు.
రూ.70 లక్షల నగదును సంచిలో దాచిపెట్టినట్టు గమనించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని పెరంబలూరులో ఈరోజు రూ.2.1 కోట్ల నగదును ఓ కారు డోరులో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.