అస్సాం లోని ధలిగాన్ ప్రాంతంలో 700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పాలిథీన్ సంచుల్లో గంజాయి తరలిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో.. హుటాహుటిన ధలిగాన్కు చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అగర్తాలా నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్చి 1వ తేదీన తెలంగాణలో 600 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.