telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలు : కారు జోరుకు “నో” బ్రేకులు

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదట బ్యాలెట్ల లెక్కింపులో వెనుకబడిన టీఆర్‌ఎస్‌ పార్టీ… ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత కారు జోరుకు బ్రేకులు లేకుండా పోయింది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు స్థానల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నానికి ఏడు డివిజన్ల ఫలితాలు వెలువడగా.. మెట్టుగూలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత, యూసఫ్‌ గూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌ కుమార్‌ పటేల్‌, రామ చంద్రాపురంలో పుష్ప నాగేష్‌, గెలుపొందారు. డబీర్‌ పురా, మోహిదీపట్నం, అహ్మద్‌ నగర్‌, రియాసత్‌ నగర్‌ డివిజన్లలో ఎంఐఎం, ఏఎస్‌రావు నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇక 26 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నా… బీజేపీ పార్టీ ఇంకా గ్రేటర్‌లో ఖాతా ఓపెన్‌ చేయలేదు. బల్దియా పై జెండా ఎగురవేస్తానన్న బీజేపీ బోణీ కొట్టకపోవడం.. ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని వ్యక్తం అవుతోంది.

Related posts