తాజాగా బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ సాయంత్రం 4గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు సహా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆరుగురు నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నక్సల్స్పై రూ.32 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.