పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో చెరువులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వలస కూలీలు మృతి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఝార్ఖండ్ నుంచి లక్నోకు వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. వీరంతా జార్ఖండ్లోని పాకూర్ జిల్లా నుండి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా మరియు ఉత్తర దినాజ్పూర్ జిల్లా వరకు వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
వివారాల్లోకి వోళితే..
జార్ఖండ్ నుంచి లక్నో వెళ్తున్న బస్సు పశ్చిమబెంగాల్లోని రాయిగంజ్ 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అయితే ఓ వాహనాన్ని బస్సు ఢీకొట్టిన అనంతరం అదుపు తప్పి.. చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.