యూపీలోని మొహమ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి భవనం కూలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనం శిథిలాల కింద ఇంకా కొంతమంది ఇరుకున్నట్లు సమాచారం. శిథిలాలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు.