telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లా టు .. ఆరోవిడత.. 12న.. బీజేపీకి పెద్ద పరీక్షే..

election notifivation by 12th said ec

అధికార బీజేపీ ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే స్థానాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న దేశ వ్యాప్తంగా గల 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. జాతీయ రాజధాని ఢిల్లీలోని ఏడు స్థానాలతో పాటు, యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించిన కమళదళం ఈసారి అనేక సవాళ్లను ఎదర్కొవల్సి వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అదంత సులువైన విషయంలా కనిపించట్లేదు. ఆప్‌, కాంగ్రెస్‌ నుంబి బీజేపీ అభ్యర్థులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. దీంతో దేశ రాజధానిలో త్రిముఖపోటీ నెలకొంది.

Congress Website hacking gujaratయూపీ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనితో ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి. నయా చరిత్రను సృష్టించింది. కానీ ఆ విజయం తాలూకు సంబరాలు ఎంతోకాలం నిలువలేదు. సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన స్థానాల్లో విపక్షాలు విజయం సాధించి సంచలనం సృష్టించాయి. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని దీటుగా ఎదుర్కొగలిగాయి. ఇదిలావుండగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో చిరకాల ప్రత్యుర్థులైన మాయావతి, అఖిలేష్‌ నేతృత్వంలోని పార్టీలు కూటమిగా ఏర్పడి విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. వారి కలయికతో యూపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చని రాజకీయ వర్గాల విశ్లేషణ. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన 71 స్థానాలను నిలుపుకోవడం అంతలేలికకాదు.

against bjp trying to apply last weapon as mp resignsఇక యూపీలోని 14 స్థానాలలో 12 సీట్లు బీజేపీ ఎంపీలకు చెందినవే. ఆయా స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి నుంచి బీజేపీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఇదిలావుడంగా తానేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్‌ కూడా పోటాపోటీ ప్రచార సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ తురుపు ముక్క ప్రియాంక గాంధీ ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఉత్కంఠ పోటీకి బిహార్‌ వేదికైంది. గత ఎన్నికల్లో 30 స్థానాలకు పైగా విజయం సాధించిన బీజేపీ ఈసారి నితీష్‌ సారధ్యంలోని జేడీయూతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగింది. 18 స్థానాలకు మే 12న పోలింగ్‌ జరుగనుంది. వీటిలో ఏడు స్థానాల్లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నారు. గత ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్‌, ఆర్జేడి కూటమి విజయంపై ధీమాతో ఉన్నాయి.

Related posts