విడతల వారీగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా నేటితో ఏడు రాష్ట్రాల్లో ఆరో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఢిల్లీలోని 7, హరియానాలోని 10, జార్ఖండ్ లోని 4, మధ్యప్రదేశ్ లోని 8, ఉత్తరప్రదేశ్ లోని 14, బీహార్ లోని 8, పశ్చిమ బెంగాల్ లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశ ఎన్నికలు జరగనున్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మిగిలింది చివరి దశ, ఈ నెల 19న జరగనున్నాయి.
షబానా కామెంట్స్ పై కంగనా సోదరి కౌంటర్