క్యూబా విప్లవం 60వ వార్షికోత్సవ సభ రేపు జరగనుంది. అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ, క్యూబా సంఘీభావ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాన్సిట్యూషన్ క్లబ్లో జరిగే ఈ సభకు క్యూబా విప్లవ వీరుడు చేగువేరా కుమార్తె అలైడ చేగువేరా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ‘హీరో ఆఫ్ క్యూబా’, ఐసిఎపి అధ్యక్షుడు ఫెర్నాండో గోనసాల్వ్స్ లాట్ మరో ముఖ్య అతిథిగా పాల్గననున్నారు.
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ విద్యా శాఖ మాజీ మంత్రి ఎం.ఎ బేబి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కాంగ్రెస్ రాజ్యసభ ఉపనేత ఆనంద్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గంటారు. ఇప్పటికే చేగువేరా కుమారై అలైడ చేగువేరా, ‘హీరో ఆఫ్ క్యూబా’ ఫెర్నాండో గోనసాల్వ్స్ లాట్ ఢిల్లీకి చేరుకున్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్ వారిని కలిశారు.