రెండోసారి బరిలో ఉన్న ప్రధాని మోదీపై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోక్సభ నియోకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలుకు వెళ్లిన తెలంగాణలోని నిజామాబాద్ రైతులకు అక్కడి అన్నదాతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ నిరసనగా ప్రధానిపై పోటీకి 45 మంది పసుపు పంట పండించే రైతులు వారణాసి చేరుకున్నారు.
వీరు నామినేషన్ వేయకుండా అక్కడి బీజేపీ కార్యకర్తలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు ఇబ్బందుకు గురిచేయడంతో నామినీలుగా సంతకానికి ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని గుర్తించిన అక్కడి రైతు సంఘాల నాయకులు తమ సభ్యులతో నామినీలుగా సంతకాలు చేయించేందుకు ముందుకు రావడంతో పసుపు రైతుల ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ భించినట్టయింది.
ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి పోటీకి 60 మందికి పైగా నామినేషన్లు పత్రాలు అందించారు. పసుపు రైతులు 45 మందితో పాటు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన 8 మంది రైతులు, తమిళనాడు హీరోడ్ ప్రాంతానికి చెందిన 15 మంది రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారి సంఖ్య వంద దాటుతుందని భావిస్తున్నారు.
ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు: చంద్రబాబు