ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికిలోనై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నప్పటికీ కూడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంటర్ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత ఫెయిలైన విద్యార్థులు మనోవేదనకు గురైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, హైద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.దీంతో ఆ కుటుంభాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకుండా కుటుంబసభ్యులు మనో ధైర్యం చెప్పాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.