telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ…ఇవాళ మరో

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 65,889 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5210 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 7,55,727 కు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు కాస్త ఊరట ను కలిగిస్తున్నాయి. ఈరోజు 30 మంది కరోనా తో మరణించారు.దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6224కు చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,55,727 పాజిటివ్ కేసులకు గాను, 7,03,208 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 46,295 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని విజ్ఞప్తి చేశారు..

Related posts