telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఘోర రోడ్డు ప్రమాదం .. 5 మృతి .. 8 మందికి తీవ్రగాయాలు..

Road accident 8 dead and 30 injured

కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణిలతో కదిరి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన ఎనిమిది మందిని సమీపంలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే కారణంగానే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts