ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వైస్ జగన్..కొందరికి అనుకూలంగా పనిచేసిన అధికారుల ఫై ప్రత్యేక దృష్టి పెట్టారు ..ఆలా ప్రమాణ స్వీకారం చేసారో లేదో కీలక అధికారులను మార్చేశాడు. తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి మించి నియమించిన 42 మంది సిబ్బందిని తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దీనికి సంబంధించి మెమో విడుదల చేశారు. దీనితో ఎవరు ఎప్పుడు బదిలీ అవుతారో..ఎవరి పోస్ట్ ఎప్పుడు పోతుందో అని అధికారులంతా బిక్కు బిక్కుమంటున్నారు. జగన్ చేస్తున్న హడావిడి చూసి అంతా అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటున్నారు..ఒక్క రోజు సీఎం గా అర్జున్ ఎలా చేశాడో..జగన్ ఈ ఐదేళ్లలో ఇంకెంత చేస్తాడో అని ఆసక్తి కనపరుస్తున్నారు.
ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు: జగన్