telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తూర్పుగోదావరి : .. పడవప్రమాదంలో .. 40 మంది మృతి..

40 died in boat accident in east godavari

జిల్లాలోని దేవీపట్నంలో విషాదం, కచ్చులూరు సమీపంలో పర్యటక బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 61 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. పాపికొండలు టూర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. తాజాగా వరద ఉధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతి ఇచ్చారు.

సమచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 21 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లతో 14 మంది ప్రయాణికులు క్షేమంగా వచ్చినట్లు తెలుస్తోంది.

Related posts