బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రమైన జగ్దల్పూర్లో కురిసిన భారీ వర్షాలకు గోడ కూలిన వేరు వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. జగదల్పూర్లో భారీ వర్ష కురిసింది. దాదాపు 288.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.
భైరామ్దేవ్ ప్రాంతంలోని బస్తర్ కలెక్టర్ అధికార నివాసానికి చెందిన ప్రహరి గోడ కూలి పక్కనే ఉన్న మరొక నివాసంపై పడటంతో అందులో నివసిస్తున్న చంద్రిక బగేల్ (45), ఆమె కుమారుడు విష్ణు బగేల్(15) మృతి చెందారు. నయాపర ప్రాంతంలో ఒక ఇంటి గోడ కూలి అందులో నివసిస్తున్న కేదార్ ఠాకూర్ (30) మృతి చెందాడు. మూడో సంఘటనలో అనుకులదేవ్ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో సోన్మతి(60) అనే మహిళ మృతి చెందిందని అధికారులు తెలిపారు.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!