telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్… ఉద్యోగం నుంచి తొలగించడంతో బిల్డింగ్ పై నుంచి దూకి…!

AIIMs

కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ జర్నలిస్ట్ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన 34 ఏళ్ల ఆ వ్యక్తి ఢిల్లీలో ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా తేలడంతో సదరు జర్నలిస్ట్‌‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు సోమవారం (జులై 6) మధ్యాహ్నం ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకారు. అక్కడున్న సిబ్బంది వెంటనే గమనించి ఆయణ్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. నాలుగో అంతస్తు పైనుంచి దూకడంతో బాధితుడడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జర్నలిస్ట్ కరోనా మహమ్మారి బారిన విషయం తెలియడంతో యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి తప్పించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

Related posts