telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ ఉద్యమం నేటితో 300 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాంగా టీడీపీ నేత చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అందులో… రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా సరే ప్రభుత్వం నుంచి భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించే ఒక్కమాట రాలేదు. పాలకుల అహంకారం ఆ స్థాయిలో ఉండటం దారుణం. రాజధాని అమరావతిని కాపాడుకునేంత వరకు తెలుగుదేశం రైతులకు అండగా ఉంటుంది. సోమవారం ఉద్యమానికి 300 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని మద్దతుగా నిలవండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించండి” అని పేర్కొన్నారు.

Related posts