తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఒక బస్సు లో నేతలు నగదు తరలించేందుకు కొత్తగా ప్రయత్నించారు. తీరా ఆ బస్సు కండక్టర్ కాస్తా ఆ నగదు చూసి, నిజాయితీని చాటుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి బస్సులో మర్చిపోయిన భారీ మొత్తంలో డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించాడు. ఏడు సంచుల్లో ఉన్న రూ.3.47 కోట్ల నగదును బస్సులో గుర్తించిన కండక్టర్ తక్షణమే ఎన్నికల అధికారులకు సమాచారం అందించాడు.
బస్సు కండక్టర్ సెల్వరాజ్ నిజాయితీని అధికారులు అభినందించారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకే నగదు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహ: సోము వీర్రాజు