telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాశ్ ఇంటి గోడకు నోటీసులు .. నేడు విచారణకు రాకుంటే చర్యలు

Ravi Prakash

ఏబీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 చానెల్ యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా, ఆయన స్పందించక పోవడంతో నిన్న సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేశారు.

బంజారాహిల్స్ లోని రవిప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించక పోవడంతో గోడకు నోటీసులు అంటించారు. రవిప్రకాశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు సైబర్ క్రైమ్ పీఎస్ లో విచారణకు రాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు.

Related posts