నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో రెండో మ్యాచ్ జరుగుతుంది. మొదటి మ్యాచ్ లో అన్ని రంగాల్లో విఫలమైన భారత్ ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక మొదటి మ్యాచ్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ కూడా సిరీస్ కోసం ఆరాటపడుతుంది. మ్యాచ్ వేదిక ఈడెన్ పార్క్లో పిచ్, బ్యాటింగ్కు సహకరిస్తుంది. పరుగుల వరద పారే అవకాశముంది.
గత ఏడాది ఇదే వేదికలో ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 10 ఓవర్లలోనే ఛేదించింది. అయినా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు గెలిచాయి. ఛేదన జట్లు ఆరు మ్యాచ్లు నెగ్గాయి. మ్యాచ్కు వాతావరణం పరంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. భారత్ రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటుందో, ఇది కూడా ఓడిపోయి, ఇరు జట్లు చెరో సిరీస్ సొంతం చేసుకుంటారో.. వేచి చూడాలి.