తెలంగాణ రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినహా 31 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం 10,371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు.
తీవ్రవాద ప్రాబల్యం ఉన్న 218 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనున్నది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,146 మంది, 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది బరిలో ఉన్నారు. రెండో విడుతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇక నుండి కర్ణాటకలో కొత్త తరహ అభివృద్ది: బీజేపీ నేత యడ్యూరప్ప