రాజస్ధాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఎన్నికల వేళ రెండు కోట్ల రూపాయల విలువగల పదికిలోల బంగారు నగలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన వెలుగుచూసింది. అహ్మదాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండుకోట్ల రూపాయల విలువగల బంగారు నగలను రవాణ చేస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.
ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ బంగారం సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నగలు ఎక్కడి నుంచి ఎక్కడికు తీసుకు వెళుతున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఏం చూసుకుని మగాడ్నని ఫీల్ అవుతున్నాడో… మాధవీలత ఫైర్