నేడు కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రతిపాదిస్తున్న పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఉధృతంగా కొనసాగాయి. పారిస్ నగరంలో ఆందోళనకారులు ప్రయాణీకుల బస్సులను అడ్డుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్రాన్స్ వాయవ్య ప్రాంతంలో వున్న బ్రెస్ట్ నగరంలో కూడా ఆందోళనకారులు బాబ్లాబస్లతో ఈ బస్లను అడ్డుకున్నారు. గతంలో మాదిరే మంగళవారం కూడా రైలు సర్వీసులు 50 శాతానికి లోపే నడిచాయి. అయితే పారిస్లో సబ్వే సర్వీసులు కొంతమేర మెరుగుపడినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ సంస్కరణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వర్కర్స్ ఫోర్స్ ప్రధానకార్యదర్శి ఈవ్స్ వేరియర్ పునరుద్ఘాటించారు.
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందించిన నయనతార…