నేడు ప్రపంచ కప్ లో భాగంగా భారత్-శ్రీలంక పోటీపడుతున్నాయి. లంక మొదటి బ్యాటింగ్ చేస్తుండగా, సీనియర్ బ్యాట్స్మన్ మాథ్యూస్ అద్భుత పోరాటపటిమ కనబర్చాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో గొప్పగా రాణించి సెంచరీతో కదంతొక్కాడు. 116 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 100 మార్క్ చేరుకున్నాడు.
అంతకుముందు 76 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న మాథ్యూస్ తర్వాత వేగంగా ఆడాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్తో రాణించడంతో లంక మెరుగైన స్థితిలో నిలిచింది. నిర్ణిత ఓవర్లలో 264/7 పరుగులు చేసింది.