సినీ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోలేని సినిమా దిల్వాలే దుల్హనియా లేజేయాంగే. 1995 లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ప్రేమకథా చిత్రాలకు ప్రాణం పోసింది ఈ సినిమా అనడం లో అతిశయోక్తిలేదు. ‘తుజే దేఖా తో యే జానా సనమ్’ అంటూ సాగే ఈ పాటని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు సినీ జనాలు. ఇదే సినిమాలో రైల్వే స్టేషన్లో వచ్చే సీన్ని అయితే కొన్ని వందల సినిమాల్లో రిపీట్ చేశారు. ఈ సినిమాతోనే షారుఖ్-కాజోల్ జోడీ ఆతరం ప్రేమికులని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది. నేటితో తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లండన్లోని సీన్స్ ఇన్ స్క్వేర్లో ఈచిత్రంలో నటించిన కాజల్ షారూఖ్కాన్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ ఓప్రకటన చేసింది. ఒక సినిమా విడుదలై25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ చిత్రం గురించి సినీ ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే ప్రేమకథ వెండితెరపై, సినీప్రియుల మనసులపై ఎలాంటి చెరగని ముద్ర వేసిందో అర్థం అవుతుంది.
previous post
అమరావతి విషయంలో కేంద్రం స్పష్టత: కన్నా